‘హిందూ విలయంగా నామకరణం చేశాం’ | Islamic State Claims It Has Established Province in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ప్రావిన్స్‌.. ఐసిస్‌ సంచలన ప్రకటన

May 11 2019 7:40 PM | Updated on May 11 2019 7:43 PM

Islamic State Claims It Has Established Province in India - Sakshi

కశ్మీర్‌ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామంటూ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించింది. దానికి ‘హిందూ విలయం’గా పేరు పెట్టినట్లు ఐసిస్‌ పేర్కొంది. ఈ విషయాన్ని ఉగ్రవాద సంస్థకు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఐసిస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాక షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి బాగానే ప్రాణ నష్టం జరిగిందని ఐసిస్‌ పేర్కొంది.

ఐసిస్ చేసిన ప్రావిన్స్ ఏర్పాటు ప్రకటనను ఎస్ఐ‌టీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ కొట్టిపారేశారు. ఈ సంస్థ ఇస్లామిక్ ఉగ్రవాదులను ట్రాక్ చేసే పనిలో ఉంటుంది. అసలు దాని ఉనికే లేని వేళ.. ఐసిస్‌ ఓ ‘ప్రావిన్స్‌’ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని ఎస్‌ఐటీఈ పేర్కొంది.

ఇక శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సోఫి కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద గ్రూపుల్లో దశాబ్దకాలంగా యాక్టివ్‌గా ఉన్నాడు. శ్రీనగర్‌ కేంద్రంగా నడిచే ఓ మేగజైన్‌కు సోఫి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐసిస్ సానుభూతిపరుడినని పేర్కొన్నట్టు మిలటరీ అధికారి ఒకరు తెలిపారు. సోఫి ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన పలు గ్రనేడ్ దాడుల్లో పాల్గొన్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌లో తమవైపు నుంచి ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు. కశ్మీర్‌లో మిగిలి ఉన్న ఐసిస్ సానుభూతి పరుడు అతడొక్కడేనని, తాజా ఎన్‌కౌంటర్‌లో అతడు కూడా హతమయ్యాడని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement