కోత్త సీఈసీగా హెచ్ ఎస్ బ్రహ్మ | HS Brahma to be India's next Chief Election Commissioner | Sakshi
Sakshi News home page

కోత్త సీఈసీగా హెచ్ ఎస్ బ్రహ్మ

Jan 14 2015 5:46 PM | Updated on Sep 2 2017 7:43 PM

కోత్త సీఈసీగా హెచ్ ఎస్ బ్రహ్మ

కోత్త సీఈసీగా హెచ్ ఎస్ బ్రహ్మ

కొత్త ఎన్నికల ప్రధాన కమిషనర్గా హరిశంకర్ బ్రహ్మ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వి.ఎస్. సంపత్ స్థానంలో హరిశంకర్ బ్రహ్మ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సంపత్ పదవీకాలం గురువారంతో ముగియనుంది. కాగా, హెచ్ఎస్ బ్రహ్మ 1975 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి.  

ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ పదవిని చేపట్టిన వారిలో జేఎం.లింగ్డో తర్వాత బ్రహ్మ రెండో వ్యక్తి అవుతారు. అలాగే, బోడో జాతికి చెందినవారిలో ఈ పదవి చేపట్టిన మొదటివారు అవుతారు. ప్రస్తుత సీఈసీ వీఎస్ సంపత్ పదవీకాలం గురువాంతో ముగియనుండటంతో బ్రహ్మ ఈ పదవి చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement