‘ఎంపీ కూతురు పెళ్లి 2.5లక్షల్లో చేస్తున్నారా?’ | How BJP MP Mahesh Sharma managed daughter's wedding in 2.5 lakhs: Kejriwal | Sakshi
Sakshi News home page

‘ఎంపీ కూతురు పెళ్లి 2.5లక్షల్లో చేస్తున్నారా?’

Nov 28 2016 1:07 PM | Updated on Mar 29 2019 8:33 PM

‘ఎంపీ కూతురు పెళ్లి 2.5లక్షల్లో చేస్తున్నారా?’ - Sakshi

‘ఎంపీ కూతురు పెళ్లి 2.5లక్షల్లో చేస్తున్నారా?’

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు.

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డారు. పెళ్లిల్లకు మాత్రమే ప్రత్యేక అనుమతి ద్వారా రెండున్నర లక్షలు తీసుకునే వెసులుబాటు ఇవ్వడాన్ని మరోసారి ప్రశ్నించారు. త్వరలో జరగబోతున్న బీజేపీ ఎంపీ మహేశ్‌ శర్మ కూతురు వివాహానికి ఏర్పాట్లు ఆయన రెండున్నర లక్షల్లోనే పూర్తి చేశారా అని ప్రశ్నించారు.

కొనుగోళ్లకు ప్రతి చోట చెక్కుల ద్వారానే చెల్లించారా అని నిలదీశారు. ఆయన అసలు నోట్ల మార్పిడిని ఎలా చేసుకున్నారని అన్నారు. మొత్తం వివాహ ఏర్పాట్లు 2.5లక్షల్లోనే పూర్తి చేశారా అని మండిపడ్డారు. నిజంగా అలాగే చేస్తుంటే అలా ఎలా చేయగలిగారో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement