భారీ ఉగ్రకుట్ర: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ | Gujarat On High Alert After IB Warns of Terrorist Movement In State Border | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి చొరబడ్డ ఆఫ్ఘనిస్తాన్‌ ఉగ్రవాదులు!

Aug 20 2019 12:12 PM | Updated on Aug 20 2019 4:30 PM

Gujarat On High Alert After IB Warns of Terrorist Movement In State Border - Sakshi

గాంధీనగర్‌: భారీ ఉగ్రకుట్రకు పాల్పడేందుకు దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని ఇంటిలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. గుజరాత్‌ సరిహద్దుల నుంచి అఫ్గనిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని ఐబీ గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. ముఖ్యంగా గుజరాత్‌ వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.అఫ్గనిస్తాన్‌ చెందిన నలుగురు ఉగ్రవాదులు ఆ దేశ పాస్‌పోర్టుల ద్వారా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు ధృవీకరించాయి.

ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల ఛాయా చిత్రాలను కూడా నిఘా వర్గాలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్‌, రాజస్తాన్‌తో పాటు ఉత్తర భారతంలోని మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. భారీ ఉగ్రకుట్రకు వారు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement