బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 15 మంది మృతి | fire accident in fireworks factory | Sakshi
Sakshi News home page

బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 15 మంది మృతి

May 4 2014 4:09 AM | Updated on Oct 8 2018 3:17 PM

బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 15 మంది మృతి - Sakshi

బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 15 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న ఓ బాణాసంచా కార్మాగారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న ఓ బాణాసంచా కార్మాగారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కర్మాగారం యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement