Sakshi News home page

బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 15 మంది మృతి

Published Sun, May 4 2014 4:09 AM

బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం; 15 మంది మృతి - Sakshi

 ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న ఓ బాణాసంచా కార్మాగారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 8 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద కారణాలు వెంటనే తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కర్మాగారం యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement