‘ప్రధాని ఫొటోలు అనుమతి లేకుండా వాడొద్దు’ | Don't publish PM's photographs without PMO approval | Sakshi
Sakshi News home page

‘ప్రధాని ఫొటోలు అనుమతి లేకుండా వాడొద్దు’

Feb 20 2017 8:24 PM | Updated on Aug 15 2018 6:34 PM

‘ప్రధాని ఫొటోలు అనుమతి లేకుండా వాడొద్దు’ - Sakshi

‘ప్రధాని ఫొటోలు అనుమతి లేకుండా వాడొద్దు’

తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ప్రచురించడానికి వీల్లేదని ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌(కేవీఐసీ) ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) నోటీసులు పంపించింది.

న్యూఢిల్లీ: తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ప్రచురించడానికి వీల్లేదని ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌(కేవీఐసీ) ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) నోటీసులు పంపించింది. కేవీఐసీకి ఈ సందర్భంగా మెమోలు కూడా జారీ చేసింది.

నూతన సంవత్సరం సందర్భంగా ఖాదీ సంస్థ కేవీఐసీ కొత్త డెయిరీ, క్యాలెండర్‌ విడుదల సందర్భంగా వాటిపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ముద్రించారు. ఇది ధుమారం రేగింది. ఈ సంఘటన జరిగిన నెల రోజుల అనంతరం ప్రధాని కార్యాలయం ఖాదీ కేవీఐసీకి నోటీసులు పంపించింది. ఇక నుంచి ప్రధాని మోదీ ఫొటో ప్రచురణకై మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా పీఎంవోను సంప్రదించడం తప్పనిసరి అని కఠిన నిబంధన పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement