
ఢిల్లీ బేకరీలో పేలుడు
ఢిల్లీలోని ఓ బేకరీలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలుకోల్పోయారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ బేకరీలో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలుకోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఢిల్లీలోని కురేజి ప్రాంతంలో గురువారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే పేలుడుకు కారణాలేమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య దళం, పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ చుట్టుపక్కల నిషేధం విధించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బేకరిలోని ఓ ఓవెన్ పేలడంవల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.