‘ప్రత్యేక హోదా’ కోరుతూ నేడు కాంగ్రెస్ ధర్నా | Congress protests to seeking of AP special status | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక హోదా’ కోరుతూ నేడు కాంగ్రెస్ ధర్నా

Feb 23 2015 1:05 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఆంధ్రప్రదేశ్‌కి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలు..

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలు సోమవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు ఏపీ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానుంది. దిగ్విజయ్‌సింగ్,  జైరాంరమేశ్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం, కేవీపీ, సి.రామచంద్రయ్యలు సమావేశానికి హాజరుకానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement