సాక్షి, ముంబై : హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపేవారు సత్మాత్ జాగ్రత్త! ఎవరైతే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారో ముఖ్యంగా హెల్మెట్ ధరించని వారిపై నగర ట్రాఫిక్ పోలీసులు ఇక మీదట కఠినంగా వ్యవహరించనున్నారు. నారిమన్ పాయింట్లో ఇటీవల నలుగురు వ్యక్తులు బైక్పై వెళుతూ బెస్ట్ బస్సును ఢీకొట్టారు. దీంతో బైక్ను నడిపిన వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిలో ఎవ్వరూ కూడా హెల్మెట్ ధరించలేదు.
దీంతో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై కఠన చర్య తీసుకునేందుకు ట్రాఫిక్ అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి.కె.ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక డ్రైవ్లో పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూలైలో హెల్మెట్ ధరించని 1.6 లక్షల ద్విచక్ర వాహనదారుల నుంచి రూ.1.19 కోట్లను జరిమానా రూపంలో విధించి వసూలు చేశామన్నారు.
ఈ డ్రైవ్లో తప్పుడు మార్గంలో బైక్ను నడిపినా, హెల్మెట్ ధరించకపోయినా వారికి జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. ఇవేకాకుండా ఈసారి అదనంగా జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనం నిలిపిన బైకులపై కూడా కేసు నమోదు చేయనున్నామని ఆయన చెప్పారు. వేగంగా వాహనం నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా ఇకమీదట కేసులు నమోదు చేయనున్నామని ఆయన వివరించారు.
అంతేకాకుండా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పోలీసులను కూడా ఆయా రోడ్లపై మోహరించనున్నట్లు అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) క్వైజర్ ఖలీద్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై కూడా నగర వాసుల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా కార్యాలయ పని గంటలు ముగిసిన వెంటనే చాలా మంది బైకులపై అతి వేగంగా వెళ్లి పాదచారుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారన్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే పోలీసులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ తెలిపారు.
హెల్మెట్ లేకపోతే కేసే..!
Published Thu, Sep 18 2014 12:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement