అస్సాంలో బాంబు పేలుడు | bomb blast in assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో బాంబు పేలుడు

Apr 4 2016 9:22 PM | Updated on Sep 3 2017 9:12 PM

అస్సాంలోని గోల్పర జిల్లాలో సోమవారం బాంబుపేలుడు సంభవించింది

గోల్పర: అస్సాంలోని గోల్పర జిల్లాలో సోమవారం బాంబుపేలుడు సంభవించింది. దుద్నోయ్లోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యాలయానికి సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాంబు పేలుడుతో  ఒక్కసారిగా కలకలం రేగింది.

ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement