బీజేపీ ఎంపీకి పాదపూజ

BJP worker washes Party MPs Feet In Jharkhand - Sakshi

రాంచీ : జార్ఖండ్‌కు చెందిన గొడ్డా బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేకు పార్టీ కార్యకర్త ఓ కార్యక్రమంలో పాదపూజ చేయడం వివాదాస్పదమైంది. వేలాదిమంది చూస్తుండగా పవన్‌ సింగ్‌ అనే కార్యకర్త ఎంపీ దూబే కాళ్లు కడిగి, ఆ నీటిని పవిత్ర జలంగా భావిస్తూ తాగడం విమర్శలకు తావిచ్చింది. ఈ ఘటనను సదరు ఎంపీ ఘనకార్యంలా తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

ఈ పోస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వైఖరిని ఎంపీ సమర్ధించుకున్నారు. దీనికి రాజకీయ రంగు ఎందుకు పులుముతారని ప్రశ్నించారు. అతిధుల పాదాలను కడగటంలో తప్పేముందని అంటూ మహాభారతంలోని కథలను వినిపించారు. చవకబారు ఆలోచనలు చేయడం తగదని విమర్శకులకు చురకలు అంటించారు. ​కాళ్లు కడిగిన నీటిని తాగడంలోనూ తప్పులేదని ఇది చరణామృతమని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top