మోదీ యాప్ విడుదల చేసిన ఆపిల్ సీఈవో | Apple CEO meets PM, launches updated 'Modi app' | Sakshi
Sakshi News home page

మోదీ యాప్ విడుదల చేసిన ఆపిల్ సీఈవో

May 21 2016 2:53 PM | Updated on Aug 21 2018 9:33 PM

మోదీ యాప్ విడుదల చేసిన ఆపిల్ సీఈవో - Sakshi

మోదీ యాప్ విడుదల చేసిన ఆపిల్ సీఈవో

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ' మొబైల్ యాప్ ను కుక్ విడుదల చేశారు.

న్యూఢిల్లీ: ఆపిల్ సీఈవో టిమ్ కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ' మొబైల్ యాప్ ను కుక్ విడుదల చేశారు. టిమ్ కుక్ ను కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, భారత్ లో పర్యటించడం పట్ల మోదీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

అందుకు సమాధానం ఇచ్చిన కుక్ త్వరలో మరోసారి ఇండియాకు రావడానికి ఇప్పటినుంచి ప్రణాళికలు తయారుచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా విడుదల చేసిన అప్ డేటెడ్ యాప్ లో వాలంటరీంగ్ సంబంధించిన సరికొత్త వివరాలున్నాయని వెల్లడించారు. కుక్ చేతుల మీదుగా యాప్ రిలీజ్ కావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement