ఘోర ప్రమాదం.. 9 మంది విద్యార్థుల మృతి..!

9 Students Killed In Road Accident On Pune Solapur Highway In Maharashtra - Sakshi

షోలాపూర్‌ : పుణె-షోలాపూర్‌ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న కారు ట్రక్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాయ్‌గర్‌లో పనిముగించుకున్న వీరు షోలాపూర్‌ మీదుగా సొంతూరు యావత్‌కు వెళ్తున్నారు. కాదమ్‌వాక్‌ వస్తీ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాల్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న లోనికాల్బోర్‌ స్టేషన్‌ పోలీసులు దర్యాప్తు ప్రారభించారు. మృతులంతా 19 నుంచి 23 ఏళ్ల వయసువారే కావడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top