ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం | 8 killed in road accident in Jagatsinghpur | Sakshi
Sakshi News home page

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం

Jun 10 2017 8:31 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఒడిశాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

జగత్‌సింగ్‌ పుర్‌: ఒడిశాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిదిమంది దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ప్రమాదం జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా మచ్చోగాం వద్ద  చోటుచేసుకుంది.

వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఎనిమిదిమంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఓ పన్నెండేళ్ల బాలిక కూడా ఉంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

గాయపడినవారిని చికిత్స నిమిత్తం జగత్‌సింగ్‌ పుర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కటక్‌ తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement