‘కార్తీక’ పుణ్యస్నానాల్లో అపశ్రుతి | 3 die in Bihar's Begusarai during Kartik Purnima celebrations | Sakshi
Sakshi News home page

‘కార్తీక’ పుణ్యస్నానాల్లో అపశ్రుతి

Nov 5 2017 2:41 AM | Updated on Nov 5 2017 2:41 AM

3 die in Bihar's Begusarai during Kartik Purnima celebrations - Sakshi

బెగూసరాయ్‌: బిహార్‌లోని సిమరియా ఘాట్‌ వద్ద శనివారం ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీ పెరిగి ఊపిరాడక ముగ్గురు వృద్ధురాళ్లు మరణించారు. తొలుత దీనిని తొక్కిసలాటగా భావించగా, చనిపోయిన ముగ్గురూ 80కి పైగా వయసు ఉన్నవారేననీ, రద్దీ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టమవడం వల్లే వారు మృతి చెందారని పోలీసులు చెప్పారు. కార్తీక పౌర్ణమి, అర్ధ కుంభ్‌ను పురస్కరించుకుని సిమరియా ఘాట్‌ వద్ద గంగా నదిలో స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement