ఢిల్లీలో మిజొరాం యువతి హత్య? | 24-year-old Mizoram girl found dead in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మిజొరాం యువతి హత్య?

Oct 17 2014 10:48 AM | Updated on Jul 30 2018 8:29 PM

ఢిల్లీలో మిజొరాం యువతి హత్య? - Sakshi

ఢిల్లీలో మిజొరాం యువతి హత్య?

దేశరాజధాని ఢిల్లీలో మిజొరాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అమ్మాయి మరణించి కనిపించింది.

దేశరాజధాని ఢిల్లీలో మిజొరాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అమ్మాయి మరణించి కనిపించింది. మునిర్కా అపార్టుమెంట్లో ఆమె హత్యకు గురైందని భావిస్తున్నారు. ఆమె సహజీవన భాగస్వామే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని కూడా అనుకుంటున్నారు. తలమీద తీవ్రమైన గాయాలు కావడంతోనే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.

ఈమె మరణంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈశాన్యప్రాంతాల వాసులపై దేశ రాజధానిలోను, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోను వరుసపెట్టి జరుగుతున్న అఘాయిత్యాల్లో భాగంగానే ఇది జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా తోసిపుచ్చలేమని అంటున్నారు. ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండటంతో అతడు ఏమైనా హత్యకు పాల్పడి ఉంటాడా అని కూడా చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement