breaking news
mizoram girl
-
కుమార్తె చేసిన పనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణలు
ఐజ్వాల్: ముఖ్యమంత్రి కుమార్తె అంటే ఆ హోదానే వేరు. ఎక్కడికెళ్లినా సాదరంగా ఆహ్వానిస్తారు. ఆమె ఆదేశిస్తే చిటికేలో పని పూర్తవుతుంది. ఆమెకు కోపం వచ్చేలా ఎవరూ మసులుకోవాలనుకోరు. అలాంటిది ఓ డాక్టర్.. మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె ఆదేశాలను ధిక్కరించాడు. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. డాక్టర్పై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా క్షమాపణలు చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే? మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా కుమార్తె మిలారి చాంగ్టే.. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లోని ఓ డెర్మటాలజిస్ట్ వద్దకు గత బుధవారం వైద్య పరీక్షల కోసం వెళ్లారు. అయితే, అపాయింట్మెంట్ లేకుండా పరీక్షించేది లేదని ఆ డాక్టర్ తేల్చి చెప్పాడు. క్లినిక్ మూసివేసే లోపు అపాయింట్మెంట్ తీసుకోవాలని మిలారి చాంగ్టేకు సూచించాడు. ఈ విషయం ఆమెకు కోపం తెప్పిచింది. నన్నే అపాయింట్మెంట్ తీసుకోమంటావా అని డాక్టర్పై దాడి చేశారు మిలారి. అక్కడున్న వారు ఆపేందుకు ప్రయత్నించినా డాక్టర్ ముఖంపై దాడి చేశారు. ఈ దృశ్యాలు వైరల్గా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మిజోరాం విభాగం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి శనివారం ఆందోళనకు దిగారు. దీంతో దిగొచ్చిన ముఖ్యమంత్రి జోరంతంగా.. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా బహిరంగ క్షమాపణలు కోరారు. తాను స్వయంగా రాసిన క్షమాపణ పత్రాన్ని పోస్ట్ చేశారు. తన కుమార్తె అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు చెప్పారు. Video: Mizoram Chief Minister's @ZoramthangaCM Daughter Hits Doctor, Father Says Sorry @SupriyaShrinate @Ashok_Kashmir pic.twitter.com/5f0EJ2RshZ — Danish Chaudhary (@LaBelleDame7) August 21, 2022 ఇదీ చదవండి: రోజువారీ కూలీకి రూ.37 లక్షల ఆదాయ పన్ను నోటీసులు -
ఢిల్లీలో మిజొరాం యువతి హత్య?
దేశరాజధాని ఢిల్లీలో మిజొరాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల అమ్మాయి మరణించి కనిపించింది. మునిర్కా అపార్టుమెంట్లో ఆమె హత్యకు గురైందని భావిస్తున్నారు. ఆమె సహజీవన భాగస్వామే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని కూడా అనుకుంటున్నారు. తలమీద తీవ్రమైన గాయాలు కావడంతోనే ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఈమె మరణంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈశాన్యప్రాంతాల వాసులపై దేశ రాజధానిలోను, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోను వరుసపెట్టి జరుగుతున్న అఘాయిత్యాల్లో భాగంగానే ఇది జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా తోసిపుచ్చలేమని అంటున్నారు. ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తుండటంతో అతడు ఏమైనా హత్యకు పాల్పడి ఉంటాడా అని కూడా చూస్తున్నారు.