కౌంట్డౌన్ మొదలైంది
కౌంట్డౌన్ మొదలైంది
‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ విడుదలకు కౌంట్డౌన్ మొదలైంది. మహేశ్బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం కేరళలోని అంగామలై అడవుల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ శుక్రవారంతో ముగుస్తుంది. 25న హైదరాబాద్ షెడ్యూల్ ఆరంభమవుతుంది. ఇందులో మేజర్ అజయ్కృష్ణ పాత్రలో మహేశ్, ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని ఈ నెల 22న సాయంత్రం 5గంటల 4నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘దిల్’ రాజు, మహేశ్బాబు, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.