చైతూ, కృతి జోడీ కుదిరింది... | Kriti Sanon to romance Naga Chaitanya | Sakshi
Sakshi News home page

చైతూ, కృతి జోడీ కుదిరింది...

Jun 1 2014 11:17 PM | Updated on Sep 2 2017 8:10 AM

చైతూ, కృతి జోడీ కుదిరింది...

చైతూ, కృతి జోడీ కుదిరింది...

‘మనం’తో నాగచైతన్య మంచి జోష్ మీదున్నారు. ‘స్వామి రారా’తో తొలి విజయాన్ని అందుకొని దర్శకుడు సుధీర్‌వర్మ మంచి స్పీడ్ మీదున్నారు. సక్సెస్‌లో ఉన్న వీరిద్దరూ కలిసి ఇప్పుడు

 ‘మనం’తో నాగచైతన్య మంచి జోష్ మీదున్నారు. ‘స్వామి రారా’తో తొలి విజయాన్ని అందుకొని దర్శకుడు సుధీర్‌వర్మ మంచి స్పీడ్ మీదున్నారు. సక్సెస్‌లో ఉన్న వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఓ చిత్రం చేస్తున్నారు. ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ని ప్రేక్షకులకు అందించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాగచైతన్య సరసన కృతి సనన్‌ని కథానాయికగా ఎంపిక చేశారు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘1’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన కృతి చేయనున్న రెండో సినిమా ఇదే అవుతుంది. ఈ చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ- ‘‘సుధీర్‌వర్మ ‘స్వామి రారా’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా. ఆ సినిమా చూడగానే... తనతో ఓ సినిమా చేయాలని నిశ్చయించుకున్నాను. యాదృచ్ఛికంగా తనే ఓ మంచి కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది.
 
 త్వరలోనే సెట్స్‌కి వెళ్లనున్నాం. ‘ఒక లైలా కోసం’ తర్వాత నేను నటించే సినిమా ఇదే అవుతుంది’’ అని చెప్పారు. ‘‘‘అత్తారింటికి దారేది’ తర్వాత చాలా కథలు విన్నాను. సుధీర్‌వర్మ చెప్పిన ఈ కథ అద్భుతం అనిపించింది. చైతూ కోసమే అన్నట్లు ఉందీ కథ. మా సంస్థ నుంచి రానున్న మరో భారీ విజయం ఈ సినిమా. ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. నాగచైతన్యను డెరైక్ట్ చేయడం, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సంస్థలో రెండో సినిమా చేయడం ఆనందంగా ఉందని, ఈ చిత్రం తన కెరీర్‌కి పెద్ద బ్రేక్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, కూర్పు: కార్తీక్ శ్రీనివాస్, సమర్పణ: భోగవల్లి బాపినీడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement