ఆస్పత్రినుంచి సినీనటుడు శర్వానంద్ డిశ్చార్జ్
రాంగోపాల్పేట్: సినిమా షూటింగ్లో గాయపడిన సినీ హీరో శర్వానంద్ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. థాయ్లాండ్లో ఓ సినిమా షూటింగ్లో గాయపడిన ఆయన ఈ నెల16న సికింద్రాబాద్ సన్షైన్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన సంగతి విదితమే. అతడి భుజానికి గాయం కావడంతో డాక్టర్ గురువారెడ్డి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం శర్వానంద్ కోలుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు