టీజర్‌ ఆన్‌ ది వే

gopichand pantham movie teaser released on june 5 - Sakshi

గోపీచంద్‌ హీరోగా నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పంతం’. ‘ఫర్‌ ఏ కాస్‌’ అన్నది ఉపశీర్షిక. శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. మెహరీన్‌ కథానాయిక. ఇది గోపీచంద్‌కి 25వ సినిమా. ఈ సినిమా టీజర్‌ను జూన్‌ 5న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌ సిల్వర్‌జూబ్లీ సినిమాను మా బ్యానర్‌లో నిర్మించడం ఆనందంగా ఉంది. మెసేజ్‌తో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి. లండన్‌లో పాటల షూట్‌ జరుగుతోంది. జూలై 5న సినిమాను రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top