థ్రిల్‌ ఫుల్‌ | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ ఫుల్‌

Published Mon, Jul 3 2017 12:27 AM

థ్రిల్‌ ఫుల్‌ - Sakshi

రిషి, సోనియా మాన్‌ జంటగా ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ ఫేమ్‌ శేఖర్‌ సూరి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డాక్టర్‌ చక్రవర్తి’. శ్రీ వెంకటేశ్వర సూపర్‌మూవీస్‌ బ్యానర్‌పై ఆకుల వెంకటేశ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.

ఈ సందర్భంగా శేఖర్‌ సూరి మాట్లాడుతూ– ‘‘ఒక వాస్తవ సంఘటన ఆధారంగా చక్కని స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఖర్చుకు వెనకాడకుండా ఎ. వెంకటేశ్‌ నిర్మించారు. విజయ్‌ కురాకుల మ్యూజిక్‌ ఈ సినిమాకు హైలైట్‌’’ అన్నారు. ‘సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకేత్తించేలా శేఖర్‌ సూరి అద్భుతంగా తెరకెక్కించారు. చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌’ చిత్రంలా ఈ సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఎ. వెంకటేశ్‌.

Advertisement
Advertisement