అభిమానులను భయపెడుతున్నాడు | director santhosh srinivas for pawankalyan vedalam | Sakshi
Sakshi News home page

అభిమానులను భయపెడుతున్నాడు

Feb 3 2016 11:18 AM | Updated on Mar 22 2019 5:33 PM

అభిమానులను భయపెడుతున్నాడు - Sakshi

అభిమానులను భయపెడుతున్నాడు

ప్రస్తుతం సర్థార్ గబ్బర్సింగ్ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం సర్థార్ గబ్బర్సింగ్ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫీషియల్గా ఏ సినిమా చేయబోయేది కన్ఫామ్ చేయకపోయినా.. పవన్ నెక్ట్స్ సినిమా దర్శకులుగా వినిపిస్తున్న పేర్లు మాత్రం, అభిమానులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా సక్సెస్కు చాలా దూరంలో ఉన్న దర్శకులు పవన్తో సినిమాకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.మొన్నటి వరకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్యతో పవన్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న వార్త టాలీవుడ్లో షికారు చేసింది.

దాదాపుగా కన్ఫామ్ అయిన ఎస్ జె సూర్య ప్రాజెక్ట్ను ఇప్పుడు పవన్ పక్కన పెట్టేశాడట. తమిళ్లో సూపర్ హిట్ అయిన అజిత్ వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో కూడా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు పవర్ స్టార్. కందిరీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత రభసతో భారీ డిజాస్టర్ను అందించిన సంతోష్ శ్రీనివాస్ను వేదలం రీమేక్కు దర్శకుడిగా ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమా రిజల్ట్పై డౌట్ పడుతున్నారు. మరి పవన్ ఈ కాంబినేషన్లో సినిమా చేస్తాడా లేక.. మరో గాసిప్తో ఆడియన్స్ ను తికమక పెడతాడా.. చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement