నిర్మాణ రంగంలోకి టాప్ మ్యూజిక్ కంపెనీ | Aditya music ventures into film production | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగంలోకి టాప్ మ్యూజిక్ కంపెనీ

Jun 27 2017 12:32 PM | Updated on Jul 23 2019 11:50 AM

నిర్మాణ రంగంలోకి టాప్ మ్యూజిక్ కంపెనీ - Sakshi

నిర్మాణ రంగంలోకి టాప్ మ్యూజిక్ కంపెనీ

ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎన్నో భారీ చిత్రాల ఆడియో

ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఎన్నో భారీ చిత్రాల ఆడియో రైట్స్  సొంతం చేసుకున్న ఈ సంస్థ తొలిసారిగా ఓ డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనుంది.  కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 'తీరన్ అధిగరమ్ ఒండ్రు' సినిమాను ఆదిత్య సంస్థ తెలుగులో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.

హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జిబ్రన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిమన్యు సింగ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. కార్తీ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్కు ఆదిత్య మ్యూజిక్ ఎండి ఉమేష్ గుప్తా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 30న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ తొలి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement