మనాగ్వ: ప్రపంచంలో ప్రమాదకర అగ్నిపర్వతాల్లో నికరాగ్వాలోని మసాయా అగ్ని పర్వతం ఒకటి. ఎప్పుడూ రగులుతుండే ఈ అగ్నిపర్వతం ఎప్పుడు బద్ధలవుతుందో ఏ పరిశోధకుడు అంచనా వేయలేకపోతున్నారు. ఏ క్షణమైనా పేలిపోయే ప్రమాదమున్న ఈ పర్వతం బద్ధలయితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడడం ఖాయం. అందుకే ఈ పర్వతాన్ని ‘మృత్యు ముఖద్వారం (మౌత్ ఆఫ్ హెల్)’ అని పిలుస్తారు. 2008లో ఈ పర్వతం ఓ మోస్తారుగా పేలినప్పుడే ఆరు కిలోమీటర్ల ఎత్తువరకు ఆకాశంలోకి బూడిద చిమ్మింది. ఇది 54 చరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది.
ఈ అగ్నిపర్వత ప్రమాదం నుంచి ప్రజలను రక్షించేందుకు కంకణం కట్టుకున్న పరిశోధకులు అత్యంత సాహసోపేతమైన అద్భుత ప్రాజెక్టు ఆవిష్కరణకు నడుం బిగించారు అగ్నిపర్వత బిళంలోపల గ్యాస్ ఎంతుంది? ఎంత ఉష్ణోగ్రత ఉంది? వాతావరణ ఒత్తిడెంత? గురుత్వాకర్షణ శక్తి ఎంత? ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా 80 వై-ఫై సెన్సర్లను అమర్చడమే వారు చేపడుతున్న అద్భుత ప్రాజెక్టు లక్ష్యం. అందుకోసం పరిశోధక బృందం అగ్నిపర్వతంలోనికి 1200 అడుగుల లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
ఈ ప్రాజెక్టుకు వాల్కనో డైవర్గా పేరుపొందిన శ్యామ్ కాస్మేన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన బృందంలో రిగ్గర్లు, ఇంజనీర్లతోపాటు మాజీ హ్యోమగామి కూడా ఉన్నారు. అగ్నిపర్వతం లోపల సెన్సర్లను అమర్చడం ద్వారా పర్వతం స్థితిగతులను, కదలికల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేసి వాటిని విశ్లేషించిన డేటాను జనరల్ ఎలక్ట్రానిక్స్ ఫేస్బుక్ పేజీకి అనుసంధానం చేస్తారు. ఈ డేటా ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రయోగం విజయవంతమయితే శాస్త్ర పరిశోధనా రంగంలో అదో మైలు రాయి అవుతుందని, అనంతరం ప్రపంచంలోని ప్రమాదకరమైన అన్ని అగ్ని పర్వతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రాజెక్టులో పనిచేస్తున్న పరిశోధకుడు గిలెర్మో కారావాంటెస్ మీడియాకు తెలిపారు
అగ్నిపర్వతం లోపల 'వై-ఫై' సెన్సర్లు
Published Wed, Aug 10 2016 3:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement