అమెరికాలో కాల్పుల కలకలం | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం: ఐదుగురి మృతి

Published Sun, Sep 1 2019 8:06 AM

Suspect Person Shoots Five At Texas - Sakshi

టెక్సాస్‌: విద్వేష తుపాకీ సంస్కృతికి అమెరికాలో మరోసారి నిండు ప్రాణాలు బలపోయాయి. కాల్పుల ఘటనతో అమెరికా ఉల్లిక్కిపడింది. టెక్సాస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అతన్ని పోలీసులు కాల్చిచంపారు. బాధితులను ఒడెస్సాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దుండగుడు పోస్టల్ వ్యాన్ చోరీ చేసి వాహనం డ్రైవింగ్ చేస్తూనే ప్రజలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా వరుస కాల్పుల ఘటనలతో అమెరికా పౌరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
Advertisement