క్రీస్తుపై చెక్కుచెదరని గాంధీ లేఖ.. భారీ డిమాండ్‌ | Mahatma Gandhi Original Letter on Jesus Christ | Sakshi
Sakshi News home page

క్రీస్తుపై చెక్కుచెదరని గాంధీ లేఖ.. భారీ డిమాండ్‌

Mar 1 2018 6:40 PM | Updated on Mar 1 2018 8:28 PM

 Mahatma Gandhi Original Letter on Jesus Christ - Sakshi

వాషింగ్టన్‌ : జీసస్‌పై భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు మహాత్మాగాంధీ రాసిన లేఖకు భారీ డిమాండ్‌ పెరగనుంది. అమెరికాలోని పెన్సిల్వానియాలో ఇప్పుడు ఆ లేఖను వేలానికి పెట్టారు. దానికి ఇప్పుడు దాదాపు రూ. 32,63,250.00 (50 వేల డాలర్లు) రానున్నాయి. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు 1926, ఏప్రిల్‌ 6న మహాత్మాగాంధీ ఈ లేఖ రాశారు.

ఒక రకమైన ఇంకుతో పెద్ద అక్షరాల్లో ఆయన ఈ లేఖను రాశారు. ఆయన సంతకం కూడా ఆ లేఖలో ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. పెన్సిల్వానియాకు చెందిన రాబ్‌ కలెక్షన్‌ అనే సంస్థ ఈ లేఖను సేకరించింది. ఈ లేఖలో ఏసు క్రీస్తు గురించి గాంధీ ఒక్క వాక్యంలో 'సహృదయంగల బోధకులందరిలో కెల్లా క్రీస్తు గొప్ప బోధకుడు' అని గాంధీ పేర్కొన్నారు. ఆయన ఈ లేఖను అమెరికాలోని తన మిత్రుడు మిల్టన్‌ న్యూబెర్రీ ఫ్రాన్ట్‌జ్‌కు రాశారు. గాంధీ రాసిన లేఖల్లోనే ఇది అత్యుత్తమమైన లేఖ అని రాబ్‌ కలెక్షన్‌ సంస్థ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement