అమెరికాలో తెలుగువిద్యార్థిపై కాల్పులు

Firing on Telugu Student in America - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికాలో మరో తెలుగువిద్యార్థిపై దుండగులు కాల్పులకు  తెగబడ్డారు. మహబూబాబాద్‌కు చెందిన పూస సాయికృష్ణ  మిచిగాన్‌ రాష్ట్రంలోని లారెన్స్‌ టెక్‌ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేస్తున్నారు. స్థానిక రెస్టారెంట్‌లో ఆహార పదార్థాలు తీసుకొని వస్తుండగా సాయికృష్ణపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సాయికృష్ణ కుడిచేతి, మెడపై బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. కాల్పుల అనంతరం సాయికృష్ణ వద్ద ఉన్న నగదు, కారు, గుర్తింపు పత్రాలను దుండగులు దోచుకెళ్లారు. ఈ ఘటన ఈనెల 3న జరిగినట్టు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top