పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: ఉదయభాను | YSRCP Leader Udaya Bhanu takes on TDP Leaders | Sakshi
Sakshi News home page

పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: ఉదయభాను

Dec 12 2015 1:00 PM | Updated on Aug 10 2018 9:42 PM

కాల్ మనీ వ్యవహారంలో పోలీసులను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను ఆరోపించారు.

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో పోలీసులను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో కృష్ణాజిల్లాలో కాల్మనీ వ్యవహారంపై సామినేని ఉదయ భాను స్పందించారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహా పలువురు టీడీపీ నేతల హస్తముందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల్లో కాల్మనీ సూత్రధారులదే హడావుడి అని ఆయన చెప్పారు. పేదల రక్తం తాగుతున్న కాల్మనీ నిందితులను ఉరి తీసినా తప్పు లేదని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై నోరు విప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement