చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్సార్సీపీ నేత పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో వీడియో, ఆడియోల సాక్ష్యంగా అడ్డంగా దొరికిపోయినా పదవికి రాజీనామా చేయని ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ధ్వజమెత్తారు. నల్లడబ్బుతో అడ్డంగా దొరికిపోయి ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు, పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు నల్లధనం గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. బొగ్గు నుంచి ఇసుక వరకు, పోలవరం నుంచి పట్టిసీమ వరకు, రాజధాని భూముల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల వరకు.. ప్రతీ అంశంలోనూ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని మండిపడ్డారు.
ఆయన బుధవారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పదేళ్లు హైదరాబాద్లో ఉంటానని, తెలంగాణలో టీడీపీని గెలిపించాకే విజయవాడ వెళతానని చెప్పిన కొద్దిరోజులకే... ఓటుకు కోట్లు కేసు, ఆర్థిక సంబంధమైన అంశాల్లో పోలీసుల విచారణకు గురికావాల్సి వస్తుందన్న భయంతోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. దేవుని సొమ్ముపైన కూడా కన్నేసి సదావర్తి సత్రం భూములను తనవారికి కట్టబెట్టారని చెప్పారు. స్విస్ చాలెంజ్ పేరుతో రాజధాని భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి వేలకోట్ల కమీషన్ దండుకోనున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అతి ధనవంతుడైన సీఎం, అతి ధనవంతుడైన మంత్రిని కలిగింది ఏపీ అని ప్రజాప్రతినిధుల గురించి సర్వే చేసే ఓ సంస్థ చెప్పిన విషయం నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే రూ.లక్షన్నర కోట్లు అవినీతి చేశారని పుస్తకం వేసి ప్రధాని, రాష్ట్రపతులతోపాటు అందరికీ సాక్ష్యాలతోసహా సమాచారమిచ్చామని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ఎలా దోచుకుంటున్నారో.. ఇటీవల ఈనాడు పత్రిక కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. ఎన్నికల్లో గెలిచింది మొదలు ప్రతీ అంశంలోనూ సొమ్ము చేసుకోవడంపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు నల్లధనం గురించి నీతులు చెబుతుంటే దేశ ప్రజలంతా విస్తుపోతున్నారని చెప్పారు. బాబు జీవితమంతా.. అబద్ధాలు, అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు. పట్టిసీమ నీటిని రాయలసీమకు అందించానని, రెయిన్గన్స్తో సీమ కరువును పారదోలానని, 2018లో అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహిస్తానని చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా పూర్తిగా నెరవేర్చారేమో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే నిరూపించు...
నల్లధనం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేస్తున్న దొంగ ప్రచారాన్ని కట్టిపెట్టాలని, దమ్ము,ధైర్యముంటే నిరూపించాలని చంద్రబాబుకు పార్ధసారధి సవాల్ విసిరారు. నీతి నిజాయితీ, సిగ్గు, లజ్జ ఉంటే తమ సవాలును స్వీకరించాలన్నారు. హైదరాబాద్లో రూ.పదివేల కోట్ల నల్లధనాన్ని ఎవరు వెల్లడించారో ఆధారాలతోసహా బయటపెట్టాలన్నారు. ఏ ప్రాంతం నుంచి ఎంత నల్లడబ్బు వచ్చిందన్న విషయాన్ని చెప్పబోమన్న కేంద్రం ప్రకటనకు విరుద్ధంగా సీఎం దొంగ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకపథకం ప్రకారం జగన్పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ తప్పుల్ని, లోపాల్ని ఎవరూ పట్టించుకోకూడదని, ఇతరులవైపు దృష్టి మళ్లించాలనే దురుద్దేశంతోనే ప్రతిపక్ష నేతపై దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు.
అడ్డంగా దొరికి నీతులా?
Published Thu, Oct 13 2016 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement