నిలువుటద్దంలా జల విధానం: కేటీఆర్ | Water policy will make of reflection of mirror, says KTR | Sakshi
Sakshi News home page

నిలువుటద్దంలా జల విధానం: కేటీఆర్

Apr 1 2016 2:57 AM | Updated on Aug 15 2018 9:30 PM

శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన తెలంగాణ జల విధానం రైతాంగం పట్ల ఆయనకున్న నిబద్ధతకు అద్దం పట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.

సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన తెలంగాణ జల విధానం రైతాంగం పట్ల ఆయనకున్న నిబద్ధతకు అద్దం పట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ గురువారం ఇచ్చిన ప్రజెంటేషన్ గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ రైతుల ఆకాంక్షలను ముఖ్యమంత్రి ప్రసంగం ఆవిష్కరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతాంగానికి కలిగే ప్రయోజనాల గురించి గత దశాబ్ద కాలంగా ఉద్యమ నాయకుడిగా వివరిస్తూ వచ్చిన ఆయన సీఎంగా లక్ష్యాన్ని సాధిం చడానికి ముందుకెళుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement