రేపు పరేడ్ గ్రౌండ్స్లో టీఆర్ఎస్ బహిరంగ సభ | TRS Rally in secunderabad parade ground | Sakshi
Sakshi News home page

రేపు పరేడ్ గ్రౌండ్స్లో టీఆర్ఎస్ బహిరంగ సభ

Jan 29 2016 10:39 AM | Updated on Aug 15 2018 9:30 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది.  ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ ఈ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే ఈ సభ ఏర్పాట్లను తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నేటి మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్స్లో దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జనవరి 31తో ముగియనుంది. రేపు సాయంత్రం 4.00 గంటలకు టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement