పెండింగ్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు
నిధులు లేక నిలిచిపోయిన పనులు
ఏడాదిన్నర దాటినా అదే పరిస్థితి
జాప్యంతో పెరిగిన వ్యయం
సీఎం ఆదేశాలకు అడ్డంకులు
బంజారాహిల్స్ రోడ్ నెం.12 ఎన్బీటీనగర్ బస్తీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 5న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాళ్లతో, గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతంలో భవన నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ ఇంజినీర్లు వేసిన ప్రణాళికలు అమలుకు నోచుకోలేదు. అధికారుల డిజైన్ మేరకు రాళ్ల ప్రదేశంలో నిర్మాణం సాధ్యం కాక ఏడాది కాలంగా పనులు వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సీఎం వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది.
సిటీబ్యూరో: రాజు తలచుకుంటే డబ్బులకు కొదవుంటుందా..! కానీ మహానగరంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి సూచించిన పనులకే నిధుల కష్టాలు వెంటాడుతున్నాయి. ఏడాదిన్నర గడిచినా ఎక్కడి గొంగడి అక్కడేనన్న చందంగా మారింది. మహానగరంలో సామాన్యులు శుభకార్యం చేయాలంటే తలకుమించిన భారమవుతుంది. ఫంక్షన్ హాళ్లకు చెల్లించే అద్దెలు ఆకాశంలో ఉంటాయి. గతంలో నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిగువ మధ్యతరగతి వారికోసం చాలినన్ని ఫంక్షన్హాళ్లు లేకపోవడాన్ని గుర్తించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్లోని పేద, దిగువ మధ్యతరగతి వారు భరించగలిగే ధరతో శుభకార్యాలు చేసుకునేందుకు అనువుగా మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అప్పటికప్పుడు రూ.90 కోట్లతో టెండర్లు పిలిచారు. మొత్తం 50 హాళ్లను నిర్మించాలన్నది లక్ష్యం కాగా, తొలుత సర్కిల్కు రెండు చొప్పున 18 సర్కిళ్లలో వెరసి 36 నిర్మించాలని భావించారు. స్థలం అందుబాటులో ఉన్న 31 ప్రదేశాల్లో టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు 16 ప్రాంతాల్లో మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి.
ఒక్కో ఫంక్షన్హాల్ అంచనా వ్యయం రూ.2.90 కోట్లుగా ప్రతిపాదించారు. అయితే, ఏడాదిన్నర గడచినా ఒక్క ఫంక్షన్హాల్ నిర్మాణం కూడా పూర్తిచేయలేదు. ఇందులో స్థలం అందుబాటులోకి రానివి కొన్నయితే, నిధుల లేమితో నిలిచిపోయినవి మరికొన్ని. పనుల్లో జాప్యం వల్ల అంచనా వ్యయం పెరిగి, రివైజ్డ్ అంచనాలతో అనుమతుల కోసం ఎదురు చూస్తున్నవి ఇంకొన్ని. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అన్నింట్లోకి నిధుల లేమే పెద్ద సమస్యగా మారింది. ఏడాదిన్నరగా కుంటుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్ల పనులపై ‘సాక్షి’ ఫోకస్..
ఒకే నమూనాతో ఉండాలని..
ఫంక్షన్ హాళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేందుకు తగిన మార్గదర్శకాలతో ప్రణాళికలు రూపొందించారు. అవి ఒక్కోటి దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలో ఉండాలి. మూడంతస్తులుగా నిర్మించాలి. ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉండాలి. మరో అంతస్తులో భోజనాలకు ఏర్పాట్లు.. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం.. పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునే అవకాశం ఉండాలని నిర్ణయించారు. స్థలం లేమితో వీటిలో కొన్నింటికి మినహాయింపులిచ్చారు.
శంకుస్థాపన చేసిన ఏడాదికి పనులు
సీతాఫల్మండిలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మాణ పనులకు 2015 డిసెంబర్ 2న మంత్రి పద్మారావు శంకుస్థాపన చేశారు. అనంతరం దాదాపు ఏడాదికి పనులు ప్రారంభించారు. తొలుత రూ.1.30 కోట్లతో నిర్మించాలనుకున్నారు. మంత్రి సూచన మేరకు మరోమారు జీహెచ్ఎంసీ అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో వ్యయం రూ. 1.70 కోట్లకు పెరిగింది. నిర్మాణ పనులు జాప్యం కావడానికి ఇదొక కారణం కాగా, మరొకటి స్థలం బదలాయింపు సమస్య. ఇక్కడ ఫంక్షన్హాలు నిర్మించాలని ప్రతిపాదించిన స్థలం రాష్ట్ర కార్మికశాఖకు చెందినది. కార్మికశాఖ నుంచి జీహెచ్ఎంసీకి స్థల బదలాయింపు జరగడంలో ఆలస్యం జరిగింది. కొత్త ప్రతిపాదనలు, స్థల బదలాయింపు సమస్యలు పరిష్కరించే నాటికి ఏడాది కాలం గడిచింది. ఎకరం మేర విస్తీర్ణం కలిగిన ఈ స్థలంలో గతంలో కార్మికశాఖ నిర్మించిన వెల్ఫేర్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో వాటిని కూల్చివేశారు. ప్రస్తుతం నేల చదును పనులు జరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
ఆశయానికి గ్రహణం
Published Sun, Jan 8 2017 11:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement