రాజ్ భవన్ ను రాజకీయ కేంద్రం చేశారు | paturi Sudhakar Reddy fired on congress leaders | Sakshi
Sakshi News home page

రాజ్ భవన్ ను రాజకీయ కేంద్రం చేశారు qqqqqqqqqq

Nov 6 2016 2:48 AM | Updated on Mar 18 2019 8:51 PM

రాజ్ భవన్ ను రాజకీయ కేంద్రం చేశారు - Sakshi

రాజ్ భవన్ ను రాజకీయ కేంద్రం చేశారు

ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. తన పుట్టిన రోజు సందర్భంగా చెప్పిన మంచి మాటలను కూడా కాంగ్రెస్ నేతలు తప్పు పట్టడం వారి దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని ...

కాంగ్రెస్ నేతలపై పాతూరి ధ్వజం

 సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. తన పుట్టిన రోజు సందర్భంగా చెప్పిన మంచి మాటలను కూడా కాంగ్రెస్ నేతలు తప్పు పట్టడం వారి దిక్కుమాలిన రాజకీయాలకు నిదర్శనమని మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమ హయాంలో గవర్నర్ పదవులను రాజకీయాలకు వాడుకుని రాజ్‌భవన్‌ను రాజకీయ కేంద్రంగా మార్చిన చరిత్ర గల కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రాజ్‌భవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరికాదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement