స్కూల్ ఫీజుల పెంపుపై ఆందోళన | parents protests in hyderabad over school fees | Sakshi
Sakshi News home page

స్కూల్ ఫీజుల పెంపుపై ఆందోళన

May 7 2016 11:28 AM | Updated on Sep 15 2018 5:39 PM

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారంటూ ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారంటూ ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం బంజారాహిల్స్లోని కల్పా స్కూల్ వద్ద పెద్ద సంఖ్యలో పేరెంట్స్ పాల్గొని నినాదాలు చేశారు.

ప్రతి ఏడాది అధికంగా ఫీజులు పెంచుతున్నారని... గత మూడేళ్లలో 70 శాతానికి పైగా ఫీజులు పెంచారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. నగరంలోని ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థులను చదివించడం పెను భారంగా మారుతుందని... దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement