'రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు' | Minister Pocharam Srinivasa reddy suggests not to seeds | Sakshi
Sakshi News home page

'రైతులు తొందరపడి విత్తనాలు వేయొద్దు'

Jun 9 2016 6:06 PM | Updated on Sep 17 2018 8:21 PM

తొలకరి వర్షాలను చూసి తొందరపడి విత్తనాలు వేయొద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు.

హైదరాబాద్‌: తొలకరి వర్షాలను చూసి తొందరపడి విత్తనాలు వేయొద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. గురువారం మంత్రి పోచారం ఖరీఫ్‌పై సమీక్ష నిర్వహించారు.

అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రుతుపవనాలు పూర్తిగా విస్తరించాకే పనులు ప్రారంభించాలని పోచారం సూచించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement