శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 450 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 450 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. శనివారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.
అందులోని ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదరు ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు.