గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆందోళన బాటపట్టారు.
గాంధీ ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన
May 8 2017 12:54 PM | Updated on Sep 5 2017 10:42 AM
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆందోళన బాటపట్టారు. యూజీసీ స్కేల్ ప్రకారం వేతనాలు పెంచి.. అర్హులైన వైద్యులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ఈ నెల 16 నుంచి అత్యవసర సేవలు నిలిపివేస్తామని వైద్యులు హెచ్చరించారు. నెల రోజులుగా రోజుకు గంట చొప్పున నిరసన తెలుపుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన గడువు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యల తీసుకోకపోవడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement
Advertisement