'వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ' | CS Rajiv sharma review meeting over Contract employees regularisation | Sakshi
Sakshi News home page

'వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ'

Jun 16 2016 3:20 PM | Updated on Sep 4 2017 2:38 AM

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎస్ రాజీవ్ శర్మ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు.

హైదరాబాద్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సీఎస్ రాజీవ్ శర్మ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు అన్ని శాఖల నుంచి ఉన్నతాధికారులు హాజరయ్యారు. శాఖల వారీగా రెగ్యులరైజ్ చేయాల్సిన ఉద్యోగుల వివరాలు సేకరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తైనవారికి రెగ్యులరైజ్ ఉత్తర్వులు జారీ చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఇంతవరకు ఉద్యోగుల వివరాలు తేల్చని డిపార్ట్మెంట్లు వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మరోసారి సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement