'వరంగల్' ప్రచారానికి హైకమాండ్ నేతలు | Congress high command leaders campaign in warangal | Sakshi
Sakshi News home page

'వరంగల్' ప్రచారానికి హైకమాండ్ నేతలు

Nov 12 2015 11:37 AM | Updated on Mar 18 2019 7:55 PM

వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని అటు అధికార... ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది.

హైదరాబాద్ : వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారాన్ని అటు అధికార... ఇటు ప్రతిపక్ష పార్టీలు ఉధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకే అని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఓరుగల్లును తమ ఖాతాలో వేసుకుని అధికార టీఆర్ఎస్కు చెక్ చెప్పాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యూహా రచన చేస్తుంది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది.

దీంతో కేంద్ర మాజీ మంత్రులు దిగ్విజయ్ సింగ్, సుశీల్కుమార్ షిండే, మల్లికార్జున ఖర్గే, సచిన్ పైలట్తోపాటు లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. నియోజకవర్గాల వారీగా ఈ నేతలంతా 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక నవంబర్ 21న జరగనుంది. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement