Sakshi News home page

ఎస్.ఐల మృతిపై న్యాయ విచారణ జరపాలి : నాగం

Published Thu, Aug 18 2016 3:20 PM

bjp leader nagam janardhan reddy demands ove si suicides in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్.ఐల మృతులపై న్యాయవిచారణ జరపాలని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో గురువారం ఆయన మాట్లాడుతూ... ముడుపుల వేధింపులతో కుకునూరుపల్లి ఎస్.ఐ. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఎస్.ఐ సూసైడ్ నోట్లోని డీఎస్పీ, సీఐని విధుల్లోంచి తొలగించాలన్నారు. కుకునూరుపల్లి ఎస్.ఐ ఆత్మహత్యతో పాటు తాండూరు, పెద్దపల్లి ఎస్.ఐల మృతిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని నాగం కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement