ఆయేషా కేసుపై ముగిసిన వాదనలు | Arguments that ended on Ayesha murder case | Sakshi
Sakshi News home page

ఆయేషా కేసుపై ముగిసిన వాదనలు

Sep 20 2017 2:59 AM | Updated on Aug 31 2018 8:34 PM

బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో పునర్‌ దర్యాప్తు నిమిత్తం దాఖలైన వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.

సాక్షి, హైదరాబాద్‌: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో పునర్‌ దర్యాప్తు నిమిత్తం దాఖలైన వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసులో పునర్‌ దర్యాప్తు చేయించాల్సిన అవసరమెంతైనా ఉందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రమా మేల్కోటే, పాత్రికేయురాలు కె.సజయ, సామాజిక కార్యకర్త వల్లూరుపల్లి సంధ్యారాణి సంయుక్తంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే.

అయితే సిట్‌ చేసే పునర్‌ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేనిపక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతల్ని అప్పగించాలంటూ ఆయేషా తల్లిదండ్రులు మరో పిటిషన్‌ వేశారు. హైకోర్టు ఆదేశిస్తేనే పునర్‌ దర్యాప్తు చేయగలమని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై వాదనలు వినిపించాలని పిటిషనర్లను ధర్మాసనం కోరింది. ఇందులోభాగంగా మంగళవారం పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది విద్యావతి వాదనలు వినిపించారు.

ఆయేషా హత్యకేసులో పునర్‌ దర్యాప్తునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే సిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే తమంతతాముగా పునర్‌ దర్యాప్తు చేయలేమని, హైకోర్టు ఆదేశిస్తే తప్పక చేస్తామని వివరించారు. స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతున్నప్పుడు కోర్టు పర్యవేక్షణ అవసరం లేదన్నారు. ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్‌ స్పందిస్తూ.. హైకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement