నటుడు విజయ్‌ ఆత్మహత్య కేసు: లాయర్‌కు బెయిల్‌

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 11న యూసుఫ్‌గూడలోని తనప్లాట్‌లో కమెడియన్‌ విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న లాయర్‌ శ్రీనివాస్‌కు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో విజయ్‌సాయి భార్య వనితారెడ్డి ఇంకా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఆమెకు మరో నోటీసు ఇచ్చేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top