బీటెక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ | 5 btec students arrested ovar mass practice in hyderabad | Sakshi
Sakshi News home page

బీటెక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్

May 16 2016 5:23 PM | Updated on Sep 4 2017 12:14 AM

బీటెక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: బీటెక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని హయత్ నగర్ లో చోటుచేసుకుంది. హయత్‌నగర్‌లోని అన్నమాచార్యఇంజినీరింగ్ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నపోలీసులుకు సమాచారం అందింది. విద్యార్థులు నారాయణ కాలేజి పరీక్ష కేంద్రంలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. కానీ సోమవారం తమ ఇళ్లకు పరీక్ష పత్రాలను తీసుకెళ్లి ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు.. దాడి చేసి ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ పోలీసులకు విద్యార్థులను అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement