కేరళవాసి నుంచి 1.9 కిలోల బంగారం స్వాధీనం | 1.9 kilograms gold seized in Shamshabad airport | Sakshi
Sakshi News home page

కేరళవాసి నుంచి 1.9 కిలోల బంగారం స్వాధీనం

Mar 20 2014 8:33 AM | Updated on Sep 2 2017 4:57 AM

ఖతార్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు.

ఖతార్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి వద్ద నుంచి 1.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఖతార్ నుంచి నగరానికి చేరుకున్న ఆ ప్రయాణికుడి లగేజిని తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులోభాగంగా తన పేరు మహ్మద్ అలిఫా అని, తన స్వస్థలం కేరళ అని కస్టమ్స్ అధికారులకు ప్రయాణికుడు వెల్లడించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement