నగరంలోని కిషన్ బాగ్ లో ఉన్న కాశీబుగ్గ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం అపశృతి చోటు చేసుకుంది.
కాశీబుగ్గ ఆలయంలో అపశ్రుతి
Mar 7 2016 4:20 PM | Updated on Mar 19 2019 5:52 PM
హైదరాబాద్: నగరంలోని కిషన్ బాగ్ లో ఉన్న కాశీబుగ్గ ఆలయంలో సోమవారం మధ్యాహ్నం అపశృతి చోటు చేసుకుంది. భక్తులపై పడిన కరెంటు తీగలను తప్పించబోయి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలుచున్న భక్తులపైకి అకస్మాత్తుగా కరెంటు తీగ తెగిపడింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అప్రమత్తమై తీగను తొలగించబోయారు. ఈ క్రమంలోనే ఆయన షాక్కు గురై మృతిచెందాడు. మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ బహదూర్పురా స్టేషన్లో పని చేస్తున్నారని సమాచారం.
Advertisement
Advertisement


