ఒక్క క్లిక్లో ప్రజలందరికీ ప్రపంచ స్థాయి సేవలు అందించేలా భారత ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ స్ఫూర్తితో ఎయిర్టెల్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరికీ, ఇంటర్నెట్పై అవగాహన కల్పించేలా గురువారం మెగా ఈవెంట్... ‘ఈచ్ వన్ టీచ్ వన్’ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఎయిర్టెల్ ఉద్యోగులు ఇందుల భాగస్వాములవుతారు. తమ పనులను పక్కనబెట్టి రోజంతా వాడవాడలా తిరిగి ఇంటర్నెట్ గురించి ప్రజలకు వివరిస్తారని ఎయిర్టెల్ ఏపీ, తెలంగాణ సర్కిల్ సీఈఓ వెంకటేశ్ విజయ్రాఘవన్ చెప్పారు. ఈ కార్యక్రమం గురించి
ఆయన మాటల్లోనే...
సామాజిక సేవలో మా వంతు బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 17 వేల మంది సంస్థ ఉద్యోగులు పాల్గొంటున్నారు. హైదరాబాద్లోని 600 మంది ఉద్యోగులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ కలిపి దాదాపు 25 వేల మంది ఈ మెగా ఈవెంట్లో భాగస్వాములవుతున్నారు. నగరంలోని 110 లొకేషన్సకు వెళ్లి క్యాంపెయిన్ నిర్వహిస్తారు.
అందరికీ అందుబాటులో...
స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికే కాదు, సాధారణ మొబైల్స్ వాడే సామాన్యులకు కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఎయిర్టెల్ ‘ఈచ్ వన్ టీచ్ వన్’ నిర్వహిస్తోంది. సరైన అవగాహన లేక చాలా మంది నెట్ను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికి
అవగాహన పెంచి ‘డిజిటల్
లిటరసీ’ని ప్రమోట్ చేయడం దీని ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో ఎయిర్టెల్ ఉద్యోగులు... బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బస్తీలు తదితర ప్రాంతాల్లోని దాదాపు 1.2 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుస్తారు. ఇంటర్నెట్ వాడకం, దాని ప్రయోజనాల గురించి వివరిస్తారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం బహుశా ఇదే తొలిసారి. సాధ్యమైనంత మందికి ఇంటర్నెట్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా కదులుతున్నాం.
ఇటీవల ఎయిర్టెల్ లాంచ్ చేసిన ‘వన్ టచ్ ఇంటర్నెట్’ పోర్టల్ ఉద్దేశం కూడా ఇదే. సినిమాలు, పాటలు, సామాజిక సైట్లే కాదు... టికెట్ బుకింగ్, ఈ కామర్స్ వంటి అన్నింటికీ వన్ స్టాప్ షాప్ ఈ పోర్టల్.
ఈవెంట్: ఈచ్ వన్ టీచ్ వన్
ప్రారంభం: బేగంపేట్ ఎయిర్టెల్ ప్రధాన కార్యాలయం
సమయం: ఉదయం 10.30 గంటలకు
ఈచ్ వన్ టీచ్ వన్
Published Thu, Dec 11 2014 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement