మా వారి వయసు 64. ఆయన ఉద్యోగ విరమణ చేసి ఆరేళ్లు అవుతోంది.
హోమియో కౌన్సెలింగ్
మా వారి వయసు 64. ఆయన ఉద్యోగ విరమణ చేసి ఆరేళ్లు అవుతోంది. ఈమధ్య ఆయన దగ్గరి వాళ్ల పేర్లు, వాళ్ల వివరాలు, చిరునామాలు మరచిపోతున్నారు. ఒక్కొక్కసారి అయోమయంగా ఉంటున్నారు. మా వారి సమస్య ఏమై ఉంటుంది. ఆయన సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? – ఒక సోదరి, వినుకొండ
సాధారణంగా పసితనం నుంచి వృద్ధాప్యం వరకు జీవితంలో చాలా మార్పులు చూస్తూ ఉంటాం. వాటిల్లో వృద్ధాప్యదశలో వచ్చే మార్పులు చాలా కలవరపెడుతుంటాయి. ఆ వయసులో మతిమరపు రావడం చాలా సాధారణం. దీన్ని వైద్యపరిభాషలో డిమెన్షియా అంటారు. అయితే సాధారణ మతిమరపును మించి... దగ్గరి బంధువులనూ, వాళ్లతో తమ సంబంధాలనూ గుర్తుంచుకోలేనంత మతిమరపు అంటే మీ భర్త సమస్య ‘అలై్జమర్స్ డిసీజ్’ కావచ్చు. ఇది సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. వయసుతో పాటు వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఆలోచన విధానం, జ్ఞాపకశక్తి, భాష విషయంలో మార్పు తెస్తుంది.
కారణాలు: ∙వంశపారంపర్యంగా రావచ్చు ∙తలకు బలమైన దెబ్బ తగలడం ∙మెదడుకు రక్తస్రపరణ జరగకపోవడం వంటివి కొన్ని కారణాలు.
లక్షణాలు: ∙జ్ఞాపకశక్తిని కోల్పోవడం ∙బాగా తెలిసిన వ్యక్తుల పేర్లు కూడా మరచిపోవడం ∙అత్యంత ముఖ్యమైన విషయాలనూ గుర్తుపెట్టుకోలేకపోవడం ∙సరిగా మాట్లాడలేకపోవడం ∙సరిగా అర్థం చేసుకోలేకపోవడం.
నిర్ధారణ: రక్తపరీక్షలు, బ్రెయిన్ సీటీ స్కాన్, ఎమ్మారై.
చికిత్స: మెదడుకు చేరే రక్తనాళాలను సరిగా పనిచేసేలా చేయడం ద్వారా రోగిలో జ్ఞాపకశక్తిని పెంపొందించవచ్చు. చికిత్స తర్వాత గుర్తుంచుకునే సామర్ధ్యం పెరుగుతుంది. ఇందుకోసం హోమియోలో కోబాల్ట్, తూజా, కనాబిస్ ఇండికా, ఇగ్నీషియా, కాలీఫాస్ మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి
హైదరాబాద్
యానల్ ఫిషర్ అంటే ఏమిటి?
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 67. మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని, ఆపరేషన్ అవసరమన్నారు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఏ. శ్రీనివాసరావు, అద్దంకి
మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా సమస్య తిరగబెట్టడం మామూలే.
కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది.
లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం రెండు గంటల పాటు నొప్పి, మంట.
వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఈఎస్ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్
చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచి చికిత్స ఉంది. ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ టి.కిరణ్ కుమార్
డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి
విజయవాడ, వైజాగ్
భరించలేని నడుము నొప్పి...
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 30. ఏడాది కాలం నుంచి తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అన్నారు. మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా?– కె. రవి, దామరచర్ల
స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు.
కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు జాయింట్స్లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు ∙స్పైన్ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది.
లక్షణాలు: కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానికి ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి.
నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్
నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఉండే ఆహారం తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, లాంగ్డ్రైవ్ చేయకపోవడం.
చికిత్స:రోగి లక్షణాలను శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి క్రమంగా తగ్గుతుంది, పూర్తిగా నయమవుతుంది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్