29 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్ | Repoll in 29 polling stations of telangana, andhra pradesh | Sakshi
Sakshi News home page

29 పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్

May 13 2014 8:12 AM | Updated on Jul 11 2019 8:26 PM

రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లోని 29 పోలింగ్‌ కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికల రీ పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లోని 29 పోలింగ్‌ కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికల రీ పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తెలంగాణలో గత నెల 30న, ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల  ఈవీఎంలు మధ్యలోనే పనిచేయటం మానేశాయి. వీటిని మార్చి కొత్త యంత్రాలను అమర్చి పోలింగ్‌ నిర్వహించారు. ఇలాంటి చోట్ల రీపోలింగ్‌ అవసరం లేదని కలెక్టర్లు నివేదించినటప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ రీ పోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలోనే ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement