పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మునిసిపాలిటీ ఓటర్లు ఎవరికీ గెలుపు వరాన్ని పూర్తిగా ఇవ్వలేదు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మునిసిపాలిటీ ఓటర్లు ఎవరికీ గెలుపు వరాన్ని పూర్తిగా ఇవ్వలేదు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 వార్డులు, తెలుగుదేశం పార్టీకి 14 వార్డులు దక్కగా, మరో మూడు స్థానాల్లో ఇతరులు గెలిచారు. దీంతో మునిసిపాలిటీ మా పరమైంది అని ఎవరూ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి సందిగ్ధ పరిస్థితే మరికొన్ని చోట్ల కూడా ఏర్పడింది. మొత్తం 13 మునిసిపాలిటీలలో ఎవరికీ ఆధిక్యం లభించలేదు. కొన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ సమానంగా స్థానాలు గెలుచుకున్నాయి.